Feb 5, 2011

మన చరిత్ర


చరిత్ర కు ఆధారాలు ఏ రూపం లో ఉన్న స్వీకరించాల్సిందే.
ఆది ఓ కట్టడమో..ఓ పుస్తకమో..శిల్పమో, శాసనమో..సూక్తో .. లేక మరేదైనా.
అయితే వేదాలు,వేదకాలం   ఉనికి ని చరిత్రకారులు ఎన్నడూ కాదనలేదు. భారత దేశ చరిత్రకు సంబందించిన ఏ పుస్తకం చూసినా..ఎవరూ రాసినా అందులో 'వేదాకాలం'  ఖచ్చితంగా ఉంటుంది, ఆధారాలతో సహా.. అందులో ప్రస్తావించిన అంశాలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని , ఆలోచన సరళిని తెలుపుతున్నయనటం లో సందేహం లేదు.
" అందులో చెప్పబడిన అన్ని విషయాలే గొప్పవని.. అవే గొప్ప విజ్ఞాన శాస్తమని, లోకం లో ఉన్న ప్రతి విషయం అందులో స్పష్టంగా చెప్పబదిందనీ మాత్రం ఒప్పుకోలేము."
 ప్రస్తుతం చాలా చిన్నవిగా..సిల్లిగా  అనిపించినా.. పశువుల మచ్చిక, పెంపకం,  వ్యవసాయం, పనిముట్లు ఉపయోగించటం "నిప్పు" , చక్రం, కనుగోనటం.. లాంటివి  ఎన్నో ఎంతో గొప్ప ఆవిష్కరణలు,  అయితే ఇవి ఎవరూ కనుగొన్నారో ఆధారాలు లేనప్పటికీ ఉపయోగించన మాట వాస్తవం.
ఇంతకు ముందే   చెప్పినట్టు..వేదోపనిశాత్తుల్లో  ఆధ్యాత్మిక తత్వం ఎక్కువ పాలు. ఆత్మ ,పరమాత్మ, యజ్ఞ యాగాది క్రతువులు,కర్మ కాండ, వీటి ప్రస్తావన విస్తృతంగా ఉండి.  జీవితం అంటే జీవనం సుఖంగా గడపటానికి కావలసిన విషయాలే కాదు , నేను ఏమిటి,  సృష్టి ఏంటి , ప్రకృతి ఏంటి,పదార్ధం ఏంటి  .. లాంటి ఆలోచనలతో మొదలు .. ఆత్మ , పరమాత్మభావన  లాంటి ఎన్నో విషయాలు  విశ్లేషించటానికి    ప్రయత్నించారు.జీవితానికి పనికి రాక పోయినా "తత్వ శాస్త్రం" కూడ ఒక విలువైనదే ఆని గ్రహించాలి. ఒక వర్గం జీవితానికి కావలసిన ఆవిష్కరణలు చేస్తే..ఇంకో వర్గం "తత్వాన్ని" గూర్చి ఆలోచిస్తుంది.
ఈ  ఆలోచన పరంపరలో ఆయుర్వేదం, సామవేదం (సంగీతం), యోగాభ్యాసం.. లాంటి ఎన్నో ఉపయొగకరమన విషయాలు లేకపోలేదు.
అవసరం ఆవిష్కరణకు మూలం. యోగాభ్యసంతో ఆరోగ్యం సమకూరి , ప్రకృతి చికిత్స తప్ప శస్త్ర చికిత్స అవసరం పెద్దగా రాలేదేమో.?
వర్గ పోరాటాలు, ఇతర దేశస్తుల దాడుల్లో ఎంతో అమూల్యమైన సమాచారం నాశనం అయ్యిందేమో..
ఉన్న సమాచారాన్ని భద్ర పరచటం, ముందు తరాలకి అందించటం లో విఫలం అయ్యారేమో ?


 పాశ్చాత్యులు దృక్పథం  సుఖమయ జీవితం అయితే.. అసలు  జీవితం ఎందుకు?  దేనికోసం అనే దృక్పథం లో మనవాళ్ళు ఆలోచించారేమో ?


తాతలు "వేస్ట్ ఫెల్లౌస్"  అని మీరు భావించినప్పటికీ .. తాతలే లేరు అనటం,
అలాగే మన చరిత్ర  గొప్పది కాకపోతే పోయింది కాని చరిత్రే లేదు అనటం సమంజసం కాదు.

No comments: