Dec 20, 2009

నేను సైతం

మన ప్రియతమ నాయకులు.. ఒకరిని మించి ఒకరు నిరాహార దీక్షలు చేస్తుంటే నాకు చాల ఆనందంగా ఉంది..దీక్షలు ఇలాగే కొనసాగించి.. సమైక్య ఆంధ్రా  కోసం ప్రాణాలు లెక్క చేయని వారి పట్టుదల ముచ్చటగా ఉంది.. నేను సైతం " సమైక్య ఆంధ్రా"   కోసం  (స్వ ఆస్తుల  రక్షణ కోసం ???  ) అంటూ నాకు  తెలిసిన .. తెలియని నాయకులు ముందుకొస్తున్నారు.(ఇలాంటి పట్టుదలే  జనాలకి సేవ చేయటం లోను.. వెనకబడిన వర్గాలను అభివృద్ధి చేయటం లోను ఉండింటే  ఇంకెంత బాగుందో అని కూడా అనుకుంటున్నా). ఇంకా కొంత మంది ఎటు తేల్చుకోలేక పోతున్నారు...ఎటు వైపు ఉంటె లాభం చేకురుతుందో అని..
ఇక మన ప్రియతమ నాయకురాలు.. సోనియా గాంధీ  గారు.. ఆహా కాంగ్రెస్ నాయకులు  అలనాటి  స్వాతంత్రోద్యమం ని తలపిస్తున్నారే అనుకుంటూ.. ప్రస్తుత కర్తవాన్ని మరిచి పోయింది.. ఆమెకి భారత దేశము, స్వతంత్రపోరాటం ... భారత దేశము   నా మాతృభూమి .. అని ప్రతిజ్ఞ తెలియకపోయినా ... తన పెనిమిటి అడుగు జాడల్లో నడుస్తూ ,, మెట్టినింటి వంశ పారంపర్య పరిరక్షణలో  మాత్రం నూటికి నూరు మార్కులు కొట్టేసింది....ఇంకా ఉందండోయే

No comments: