Dec 20, 2009

నేను సైతం

మన ప్రియతమ నాయకులు.. ఒకరిని మించి ఒకరు నిరాహార దీక్షలు చేస్తుంటే నాకు చాల ఆనందంగా ఉంది..దీక్షలు ఇలాగే కొనసాగించి.. సమైక్య ఆంధ్రా  కోసం ప్రాణాలు లెక్క చేయని వారి పట్టుదల ముచ్చటగా ఉంది.. నేను సైతం " సమైక్య ఆంధ్రా"   కోసం  (స్వ ఆస్తుల  రక్షణ కోసం ???  ) అంటూ నాకు  తెలిసిన .. తెలియని నాయకులు ముందుకొస్తున్నారు.(ఇలాంటి పట్టుదలే  జనాలకి సేవ చేయటం లోను.. వెనకబడిన వర్గాలను అభివృద్ధి చేయటం లోను ఉండింటే  ఇంకెంత బాగుందో అని కూడా అనుకుంటున్నా). ఇంకా కొంత మంది ఎటు తేల్చుకోలేక పోతున్నారు...ఎటు వైపు ఉంటె లాభం చేకురుతుందో అని..
ఇక మన ప్రియతమ నాయకురాలు.. సోనియా గాంధీ  గారు.. ఆహా కాంగ్రెస్ నాయకులు  అలనాటి  స్వాతంత్రోద్యమం ని తలపిస్తున్నారే అనుకుంటూ.. ప్రస్తుత కర్తవాన్ని మరిచి పోయింది.. ఆమెకి భారత దేశము, స్వతంత్రపోరాటం ... భారత దేశము   నా మాతృభూమి .. అని ప్రతిజ్ఞ తెలియకపోయినా ... తన పెనిమిటి అడుగు జాడల్లో నడుస్తూ ,, మెట్టినింటి వంశ పారంపర్య పరిరక్షణలో  మాత్రం నూటికి నూరు మార్కులు కొట్టేసింది....ఇంకా ఉందండోయే

Dec 17, 2009

. ఏ గుండైతే ఎంటంట ..

Easily Upload Your Images To Myspace
Free Music

మొత్తానికి ఒక ఉద్యమం ముగిసింది అనుకుంటునదాగానే మరొక యుద్ధం మొదలైంది ,, ఆంద్ర ప్రదేశ్ లో. తెలంగాణా ,రాయలసీమ ఆంధ్ర లలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు , మన MP, MLA ల అ రాజీనామాలు చూస్తుంటే వీళ్ళకి అసలు "విషయం" మీద అవగాహన లేకుండానే నిర్ణయాలు తెసుకున్నరేమో అని అనిపిస్తుంది. మొన్నటి దాక అధిష్టానం శిరోధార్యం అన్నారు. ఈ రోజు చిదంబరం ఎవరు? సోనియా ఎవరు ? నిర్ణయం తీసుకోటానికి అని అంటున్నారు..
మరి మొన్నే స్పష్టంగా చెప్పాల్సింది.. తెలంగాణా ఇచ్చిన పక్షం లో మేము రాజీనామా చేస్తాం అని.. ఎవడబ్బ సొమ్మని ఇష్టం వొచ్చినపుడు రాజేనామ చేయటానికి..


ఒక్కొక్కరి ముఖం చూస్తుంటే..కనిసం మాట్లాడటానికి రాని ఇలాంటి వాళ్ళు ఎన్నికల్లో ఎలా గెలిచారా అని సందేహం వేస్తోంది నాకు.. వీల మొహాలు చూసి, వోటేసిన్నట్టు ఫీల్ అయిపోతున్నారు..అదంతా కాంగ్రెస్ మహిమ అని తెలుసుకోలేక పోతున్నారు..ఎవడు పార్టి టిక్కెట్టు ఇస్తే వాడి వెంట పరిగెత్తే వీళ్ళు.. ఎవడు పదివి ఇస్తా నంటే వాడి పంచన చేరే వీళ్ళు .. ఎవడు డబ్బు పారేస్తే వాడి పార్టి లో చేరే వీళ్ళు .. ఉంటె ఏంటి పోతే ఏంటి.??
వీళ్ళు కాక పోతే వేరే ఓల్లు .. ఏ గుండైతే ఎంటంట ..


మేము కలిసి ఉండము మొర్రో అని ఒక దంపతులు అంటే,, కలిసే ఉండాలి అని నిర్ణయించి నట్టు ఉంది ఈ తంతు చూస్తుంటే..
విడిపోతే నష్టమే .అది వాస్తవమే.. కాని.. విడిపోవాలి అనేంత దాక తెసుకోచ్చారు విషయాన్ని.
సమక్య ఆంధ్ర అనేది ఇక కల్ల..వదిలేసి.. తమ తమ రాష్ట్రాలని ఏవిధంగా అభివృద్ధి పరచాలో ఆలోచించుకోండి. ఒకవేళ కలిసి ఉన్న ఒరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. అలా అని తెలంగాణా విడిపోయి ఊ పెద్ద అభివృద్ధి సాధిస్తుంది అనుకోటం కూడా భ్రమ. కేవలం ఒక మానసిక స్వాంతన.  వాడు కాకా పోతే వీడు అన్న చందంగా ..... ఇంకొంత మంది స్వార్థాలకి బలి.